ETV Bharat / bharat

'అమ్మలాంటి రంగానికి కీడు తలపెడతామా?'

author img

By

Published : Dec 14, 2020, 3:39 PM IST

వ్యవసాయ రంగానికి హాని కలిగించే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నేలేదని నొక్కిచెప్పారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. దేశానికి సాగు రంగం తల్లిలాంటిదని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

Rajnath Singh
రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతులు తమ ఆందోళనలు ఉద్ధృతం చేసిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వ్యవసాయ రంగం.. దేశానికి తల్లిలాంటిదని నొక్కిచెప్పారు. సాగు రంగానికి కీడు చేసే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు.

పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు రాజ్​నాథ్​. సాగు చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు.

" వ్యవసాయ రంగానికి హాని చేసే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నే లేదు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఇటీవలి సంస్కరణలు తీసుకొచ్చాం. మహమ్మారి సమయంలో ప్రతికూల ప్రభావాలను వ్యవసాయ రంగం నివారించగలిగింది. ఈసారి వ్యవసాయ దిగుబడి, కొనుగోలు అత్యధికంగా ఉంది. మన ధాన్యాగారాలు పూర్తిగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక ఏడాది తొలి 5 నెలల్లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(35.73 బిలియన్​ డాలర్లు) మన దేశానికి వచ్చాయి. గతఏడాదితో పోలిస్తే 13 శాతం అధికం. అది మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతోంది."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

చైనా బలగాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు: రాజ్​నాథ్​

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి మన సైన్యం బలంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​. చైనా బలగాలతో ఎంతో ధైర్యంతో పోరాడి వారిని వెనక్కి వెళ్లేలా చేశారని చెప్పారు. మన బలగాల శౌర్యాన్ని ఈ దేశ భవిష్యత్తు తరాలు సైతం గొప్పగా చెప్పుకుంటాయన్నారు. హిమాలయాల సరిహద్దుల్లో శత్రు దేశాల దూకుడు.. ప్రపంచం ఏవిధంగా మారుతోంది, ప్రస్తుత ఒప్పందాలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు, హిమాలయాలలోనే కాకుండా ఇండో-పసిఫిక్​ అంతటా అధికారం ఎలా ఉందో గుర్తు చేస్తోందన్నారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతులు తమ ఆందోళనలు ఉద్ధృతం చేసిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వ్యవసాయ రంగం.. దేశానికి తల్లిలాంటిదని నొక్కిచెప్పారు. సాగు రంగానికి కీడు చేసే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు.

పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు రాజ్​నాథ్​. సాగు చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని వెల్లడించారు.

" వ్యవసాయ రంగానికి హాని చేసే నిర్ణయాలు తీసుకునే ప్రశ్నే లేదు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఇటీవలి సంస్కరణలు తీసుకొచ్చాం. మహమ్మారి సమయంలో ప్రతికూల ప్రభావాలను వ్యవసాయ రంగం నివారించగలిగింది. ఈసారి వ్యవసాయ దిగుబడి, కొనుగోలు అత్యధికంగా ఉంది. మన ధాన్యాగారాలు పూర్తిగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక ఏడాది తొలి 5 నెలల్లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(35.73 బిలియన్​ డాలర్లు) మన దేశానికి వచ్చాయి. గతఏడాదితో పోలిస్తే 13 శాతం అధికం. అది మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపుతోంది."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

చైనా బలగాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు: రాజ్​నాథ్​

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి మన సైన్యం బలంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​. చైనా బలగాలతో ఎంతో ధైర్యంతో పోరాడి వారిని వెనక్కి వెళ్లేలా చేశారని చెప్పారు. మన బలగాల శౌర్యాన్ని ఈ దేశ భవిష్యత్తు తరాలు సైతం గొప్పగా చెప్పుకుంటాయన్నారు. హిమాలయాల సరిహద్దుల్లో శత్రు దేశాల దూకుడు.. ప్రపంచం ఏవిధంగా మారుతోంది, ప్రస్తుత ఒప్పందాలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు, హిమాలయాలలోనే కాకుండా ఇండో-పసిఫిక్​ అంతటా అధికారం ఎలా ఉందో గుర్తు చేస్తోందన్నారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.